జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః ।
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ।। 2 ।।
జ్ఞానం — జ్ఞానము; తే — నీకు; అహం — నేను; స — తో; విజ్ఞానం — విజ్ఞానము; ఇదం — ఇది; వక్ష్యామి — తెలియ చెప్పెదను; అశేషతః — సంపూర్ణముగా; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకున్న పిదప; న — ఉండదు; ఇహ — ఈ లోకంలో; భూయః — మరింక; అన్యత్ — వేరే ఏది; జ్ఞాతవ్యం — తెలుసుకోవలసినది; అవశిష్యతే — మిగులును.
BG 7.2: ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.
జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః ।
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ।। 2 ।।
ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ఇంద్రియమనోబుద్ధులచేత తెలుసుకున్న దానిని జ్ఞానము అంటారు. ఆధ్యాత్మిక సాధన వలన అంతర్గతంగా, లో-నుండి తెలియవచ్చిన దానిని విజ్ఞానము అంటారు. విజ్ఞానము అనేది బుద్ధిచే నేర్చుకున్నది కాదు; నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఉదాహరణకి, మనం ఒక సీసాలో ఉన్న తేనే యొక్క తియ్యదనం గురించి గొప్పగా వింటూ ఉండవచ్చు, కానీ అది పుస్తక/సిద్ధాంతపరమైన జ్ఞానం గానే మిగిలిపోతుంది. కానీ, ఈ బాటిల్ మూత తీసి దాంట్లో ఉన్న తేనె రుచి చూస్తే, దాని యొక్క తియ్యదనం యొక్క అనుభవపూర్వక జ్ఞానం వస్తుంది. అదే విధంగా, గురువు మరియు శాస్త్రముల నుండి మనకు తెలిసేది జ్ఞానము, మరియు ఆ జ్ఞానం అనుసరించి మనం సాధనా అభ్యాసం చేసి, అంతఃకరణ శుద్ది చేసుకున్నప్పుడు, మనలోనుండే ఉదయించిన వివేకమునే, విజ్ఞానము అంటారు.
వేద వ్యాస మహర్షి - భక్తి యొక్క స్వభావము, మహిమలు, మరియు భక్తి విశేషము విశదీకరిస్తూ - శ్రీమద్ భాగవతం వ్రాయాలని సంకల్పించినప్పుడు, ఆయన జ్ఞానంపై ఆధారమై వ్రాయటంలో సంతృప్తి చెందలేదు; అందుకే మొదట భగవంతుని పట్ల అనుభవపూర్వక విజ్ఞానం కోసం భక్తిలో నిమగ్నమైనాడు:
భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే ఽమలే
అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తద్-అపాశ్రయాం (భాగవతం 1.7.4)
‘భక్తి యోగము ద్వారా, ప్రాపంచిక తలంపులు ఏమీ లేకుండా, వేద వ్యాసుడు తన మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేసాడు; దీనితో, భగవంతుని అధీనంలో ఉండే ఆయనకే చెందిన బాహ్య శక్తి మాయ సమేతంగా, వేద వ్యాసునికి, సర్వోత్కృష్టుఁడైన దివ్య భగవంతుని దర్శనం కలిగింది.’ ఈ అంతర్గత విజ్ఞానం కలిగిఉండి, అటు పిమ్మట ఆయన ఈ ప్రసిద్ధ పురాణాన్ని వ్రాసాడు.
సర్వోత్క్రుష్ట పరమాత్మ యొక్క సిద్ధాంత జ్ఞానం చే అర్జునుడిని ప్రకాశితం చేస్తానని మరియు అతనికి దాని అంతర్గత విజ్ఞాన వికాసానికి తోడ్పడతానని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఈ విజ్ఞానం తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవటానికి ఇంకేమీ మిగలదు.