కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ।। 21 ।।
కార్య — కార్యము; కారణ — కారణము; కర్తృత్వే — ఉత్పన్నము చేయుటలో; హేతుః — హేతువు; ప్రకృతిః — భౌతిక శక్తి; ఉచ్యతే — చెప్పబడును; పురుషః — జీవాత్మ; సుఖ-దుఃఖానాం — సుఖ దుఃఖముల యొక్క; భోక్తృత్వే — అనుభవించుటలో; హేతుః — హేతువు; ఉచ్యతే — అంటారు.
BG 13.21: సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ।। 21 ।।
సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
బ్రహ్మ దేవుని నిర్దేశం అనుసరించి, భౌతిక శక్తి, ఈ సృష్టిలో ఎన్నెన్నో విభిన్నమైన జీవన మూలపదార్థములను మరియు జీవ రాశులను సృష్టిస్తుంది. బ్రహ్మ దేవుడు బృహత్ పథకాన్ని రచిస్తాడు, దానిని భౌతిక శక్తి అమలుపరుస్తుంది. భౌతిక జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నట్టు వేదములు పేర్కొంటున్నాయి. ఈ శారీరక స్వరూపాలు అన్నీ కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరాలే. కాబట్టి ప్రకృతియే జగత్తులోని కారణము మరియు కార్యములకు మూలహేతువు.
ఆత్మకు ఈ శరీర రూపము (క్షేత్రము) దాని యొక్క పూర్వ జన్మల కర్మ ఫలముగా లభిస్తుంది, మరియు అది తనను తానే ఈ శరీరము, మనస్సు, మరియు బుద్ధి అనుకుంటుంది. అందుకే అది శారీరక సుఖముల కోసం ప్రయత్నిస్తుంది. ఇంద్రియములు, ఇంద్రియవస్తు విషయములతో సంపర్కము చెందినప్పుడు, మనస్సు ఒక ఆనందకర అనుభూతిని పొందుతుంది. ఆత్మ, మనస్సుతో అనుసంధానం అయి ఉన్నకారణంగా, ఆత్మ పరోక్షంగా ఈ సుఖాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా, ఆత్మ అనేది, ఇంద్రియమనోబుద్ధుల ద్వారా సుఖదుఃఖములను అనుభవిస్తుంది. దీనిని ఒక కలతో పోల్చవచ్చు.
ఏహి బిధి జగ హరి ఆశ్రిత రహఈ. జదపి అసత్య దేత దుఃఖ అహఈ
(రామచరితమానస్)
జౌం సపనేం సిర కాటఇ కోఈ. బిను జాగేఁ న దూరి దుఖ హోఈ
(రామచరితమానస్)
‘ఈ జగత్తు భగవంతునిచే నిర్వహించి పోషించబడుతున్నది. అది ఒక భ్రాంతిని కలుగచేస్తుంది, అది, అసత్యమైనా, ఆత్మని యాతనకి గురి చేస్తుంది. ఇది ఎలాగంటే, స్వప్నంలో వ్యక్తి తల తెగిపోతే, ఆ యాతన, ఆ వ్యక్తి నిద్రలేచి, కలలు కనటం ఆపేంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది.’ శరీరముతోనే అనుసంధానం చేసుకున్న ఈ యొక్క ప్రస్తుత స్వప్న స్థితిలో కూడా, ఆత్మ తన యొక్క పూర్వ మరియు ప్రస్తుత కర్మల పరంగా సుఖదుఃఖములను అనుభవిస్తూనే ఉంటుంది. ఫలితంగా, రెండు రకాల అనుభూతులకు కూడా అదే కారణము అని చెప్పబడుతుంది.