న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ।। 40 ।।
న — కాదు; తత్ — అది; అస్తి — ఉండుట; పృథివ్యాం — భూమిపై; వా — లేదా; దివి — పైనున్న స్వర్గాది లోకాలు; దేవేషు — దేవతలలో; వా — లేదా; పునః — మరల; సత్త్వం — ఉండుట; ప్రకృతి-జైః — ప్రకృతి త్రిగుణముల ద్వారా జనించిన; ముక్తం — విముక్తి పొందిన; యత్ — అది; ఏభిః — వీటి ప్రభావం నుండి; స్యాత్ — ఉండును; త్రిభిః — మూడు; గుణైః — ప్రకృతి గుణములు.
BG 18.40: ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ।। 40 ।।
ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల …
Sign in to save your favorite verses.
Sign In
Navigate directly to the wisdom you seek
Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
భౌతిక శక్తి అయిన - మాయ - మూడు వర్ణములలో ఉంటుంది అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు పేర్కొంటున్నది:
అజామేకాం లోహిత-శుక్ల-కృష్ణాం
బహ్వీః ప్రజాః సృజమానాం స-రూపాః
అజోహ్వేకో జుషమాణో ఽనుశేతే
జహాతి ఏనాం భుక్త-భోగాం అజోన్యః (4.5)
‘భౌతిక ప్రకృతి మూడు వర్ణములలో ఉంటుంది - తెలుపు, ఎరుపు, మరియు నలుపు, అంటే, దానికి మూడు గుణములు ఉంటాయి - సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. విశ్వములోని అసంఖ్యాకమైన జీవులకు అది మాతృ-గర్భము వంటిది. పుట్టుకలేని, సంపూర్ణ జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతునిచే అది అస్తిత్వములోనికి తీసుకురాబడి, ఆయనచే నిర్వహించబడుతున్నది. కానీ, భగవంతునికి ఈ భౌతిక శక్తి అంటదు. ఆయన తనకుతాను వేరుగా అలౌకిక లీలానందమును రమిస్తుంటాడు. కానీ, జీవుడు దానిని భోగిస్తూ తద్వారా బద్ధుడై పోతాడు.’
నరక లోకాల నుండి బ్రహ్మ లోకం వరకూ మాయ యొక్క పరిధి ఉంటుంది. ప్రకృతి త్రిగుణములు - సత్త్వము, రజస్సు, మరియు తమస్సులు, మాయ యొక్క అంతర్లీన గుణములు కాబట్టి, అవి అన్ని భౌతిక లోకాలలో ఉంటాయి. అందుకే, ఈ లోకాలలో ఉండే సమస్త జీవ రాశులు, వారు మానవులైనా లేదా దేవతలైనా, ఈ త్రి-గుణముల ప్రభావంలోనే ఉంటారు. ఉన్న తేడా అంతా ఈ గుణములు ఉండే పాళ్ళు వేర్వేరుగా ఉండటమే. నిమ్న లోకాలలో నివసించేవారు తమోగుణము ప్రధానంగా కలిగి ఉంటారు; భూలోకంలో ఉండేవారు రజోగుణ ప్రధానంగా ఉంటారు; మరియు స్వర్గాది లోకాలలో ఉండేవారు సత్త్వ గుణ ప్రధానంగా ఉంటారు. ఇక ఇప్పుడు ఈ మూడు చలరాశుల పరంగా, మానవులు ఎందుకు భిన్నమైన స్వభావములను కలిగి ఉంటారో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.