యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ।। 22 ।।
యం — ఏదైతే; లబ్ద్వా — లభించిన తర్వాత; చ — మరియు; అపరం — మరి ఇంకేదీ; లాభం — లాభము; మన్యతే — భావించును; న — కాదు; అధికం — గొప్పది; తతః — దాని కంటే; యస్మిన్ — దేనిలో అయితే; స్థితః — స్థితుడై ఉండునో; న — ఎన్నటికీ కాడు; దుఃఖేన — దుఃఖము చేత; గురుణా — మిక్కిలి; అపి — అయినా కూడా; విచాల్యతే — చలించుట.
BG 6.22: ఆ స్థితిని పొందిన తరువాత, వ్యక్తి, మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి, వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు.
యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ।। 22 ।।
ఆ స్థితిని పొందిన తరువాత, వ్యక్తి, మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి, వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
భౌతిక జగత్తులో ఎంత మేర సాధించినా, వ్యక్తి సంపూర్ణ తృప్తి పొందలేడు. ఓ పేద వాడు, ధనవంతుడు కావటానికి ఎంతో కష్ట పడతాడు, మరియు తను లక్షాధికారి కాగానే తృప్తి పడ్డ భావన పొందుతాడు. కానీ, అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరున్ని చూడగానే, అసంతృప్తి మొదలౌతుంది. ఆ కోటీశ్వరుడు కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం కలవాడిని చూసినప్పుడు అసంతృప్తి చెందుతాడు. మనకు ఎంత సంతోషం లభించినా, అంత కన్నా ఎక్కువ సంతోషం ఉంది అనుకున్నప్పుడు, ఎదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ, యోగ స్థితి యందు పొందిన ఆనందం అనేది ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దాని కంటే ఇంకా ఏదీ ఉన్నతమైనది లేదు కాబట్టి, ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు, ఆత్మ సహజంగానే తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు గ్రహిస్తుంది.
భగవంతుని దివ్యానందము నిత్య శాశ్వతమైనది కూడా, దానిని ఒకసారి సాధించిన యోగి నుండి దాన్ని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్-ప్రాప్తి నొందిన జీవి, భౌతిక శరీరంలోనే వసించి ఉన్నా, భగవత్ భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి, బాహ్యంగా చూస్తే - అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్టు అగుపించవచ్చు, కానీ, అంతర్లీనంగా ఆ మహాత్ముడు భగవత్ సాన్నిధ్యం లోనే ఉండి, దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి, ఎంత తీవ్రమైన విపత్తు అయినా అటువంటి మహాత్ముడిని చలింపచేయలేదు. భగవంతుని తోనే ఏకమైన స్థితిలో ఉండి, ఆ మహాత్ముడు శారీరిక దృక్పథం నుండి అతీతంగా ఎదుగుతాడు, మరియు భౌతిక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా, మన పురాణాలలో, ప్రహ్లాదుడి అంతర్గత స్థితి ఎలాగుందంటే - పాముల గుంటలో వేయబడినా, ఆయుధాలతో హింసించబడినా, అగ్నిలో ఉంచబడినా, మరియు కొండపై నుండి విసిరివేయబడినా - ఇవేవీ కూడా ప్రహ్లాదునికి భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి.